దేశంలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి తగ్గిపోవడంతో జీలకర్ర ధరలు ఏడాదిలోనే 72శాతం రికార్డు స్థాయికి పెరిగాయి. చాలామంది రైతులు ఎక్కువ లాభదాయకమైన పంటలవైపు మళ్లడంతో ఈ పరిస్థితి వచ్చింది. జీలకర్రను ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం కాబట్టి భారతదేశంలో తక్కువ దిగుబడి ప్రపంచ ధరలను ప్రభావితం చేస్తుందని వ్యాపారులు అంటున్నారు.